Wednesday, April 30, 2014

Palasa Assembly constituency 2014,పలాస నియోజకవర్గం2014

  •  
  • [Mandals+in+Srikakulam+dist.jpg]
  •  Election 2014.
  •  
  •  Palasa Assembly Constituency,పలాస నియోజకవర్గం 2014 ఎన్నికల్లో పోటీ అబ్యర్ధులు :
  •     కాంగ్రెస్ :  వంక నాగేశ్వరరావు   ,
        టి.డి.ఫి :  గౌతు శ్యామసుందర శివాజీ   ,
        వై.ఎస్.ఆర్ : వజ్జ బాబూరావు   ,
        జై సంక్యాంధ్ర : కణితి విశ్వనాధం .డా.(MBBS)  ,
        ఆమ్‌ ఆద్మీ : బమ్మిడి సంతోష్ కుమార్  ,
        బి.యస్.పి. : గుంటు జంగమయ్య  ,
        లోక్ సత్త  : తమ్మినేని మాధవరావు   ,
        ఇండిపెండెంట్ :  కొమర శంకరరావు & మజ్జి శారద ,
        సి.పి.ఐ : చాపర వెంకటరమణ  ,
        సి.పి.ఎం :తామాడ సన్యాసిరావు  ,
పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు, పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఏజెన్సీ, మైదానం, ఉద్దాన ప్రాంత సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ పలు చారిత్మక, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. వందల సంవత్సరాల కిందట నిర్మించిన తర్లాకోట నాటి రాజుల పాలనకు మైలురాయి. ఒరిస్సాలోని పూరీ రథయాత్ర మాదిరిగా తర్లాకోట వద్ద జగన్నాథ యాత్ర జరుగుతుంది. గిరిజన ప్రాంతంలోని సవర గోవిందపురానికి వెళ్లే రహదారిలో స్వయం భూలింగేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణ. ఉద్దాన ప్రాంతం బొడ్డపాడు విప్లవోద్యమాలకు పుట్టినిల్లుగా భారతదేశంలోనే పేరుగాంచింది. పలాస మండలంలోని బ్రహ్మాణతర్లా గతంలో నియోజకవర్గ కేంద్రం. గిరిజన ఆచార వ్యవహారాలు, గిరుల సౌందర్యం ఆసక్తి గొలుపుతాయి. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో జీడి పప్పు ఉత్పత్తి జరుగుతోంది. పలాస పట్టణ శివారున ఉన్న డేకురుకొండకు చారిత్రక ప్రాముఖ్యం ఉంది.

వజ్రపు కొత్తూరు మండలంలో ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడి పంటల జీవనాధారం. బ్రిటిష్‌ కాలంలో వలస వచ్చిన కవిటీల గ్రామం నువ్వలరేవు ఆచార, వ్యవహారాలు ప్రత్యేక ఆకర్షణగా నిస్తోంది. బెండి గ్రామంలో ప్రాచీన నందికేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. గతంలో పలాస మండలంలోని పలాస- కాశీబుగ్గ పంచాయతీ 1997లో నగర పంచాయతీగా ఏర్పడింది. పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు. 2002లో పురపాలక సంఘంగా ఏర్పడ్డాయి. మెదట 21 వార్డులు ఉండగా, 2007లో 25 వార్డులుగా మార్పు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 57,438 మంది జనాభా ఉన్నారు.

పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం సమాచారం :
  • జనాభా- 57,438 (2011 ప్రకారం)
  • పురుషులు - 28,074
  • స్త్రీలు - 29,364
  • అక్ష్యరాస్యత 39,754
  • అక్షరాస్యతా శాతం - 69 శాతం
  • మురికివాడలు 42
రోడ్లు
  • సి.సి రోడ్లు - 22.74 కిలోమీటర్లు
  • బి.టి రోడ్లు - 12 కిలోమీటర్లు
  • డబ్లూబియం రోడ్లు- 42.6 కిలోమీటర్లు
  • కచ్చారోడ్లు - 40.52 కిలోమీటర్లు
కాలువలు
  • పక్కా కాలువలు - 15.3 కిలోమీటర్లు
  • కచ్చాకాలువలు - 45.5 కిలోమీటర్లు
నీటి వ్యవస్థ.
  • పబ్లిక్‌ కొళాయిలు - 109
  • ఇంటింటి కొళాయిలు - 750
  • ఇంటింటి కొళాయిలు( బిపిఎల్‌)- 120
  • బోర్లు - 192
  • బావులు - 119
  • నీటి సరఫరా - రోజుకి ఒక్కరికి - 29 లీటర్లు
గృహాలు - 14,200.
  • ఆస్తిపన్ను - 1.75 కోట్లు
పారిశుద్ధ్యం.
  • పారిశుధ్య సిబ్బంది- 70 (తాత్కాలిక), 12 (శాశ్వత)
  • వాహనాలు- ట్రాక్టర్లు-4, వీల్‌బారోస్‌- 17, టైసైకిళ్లు-13, ఆటోలు-2.

పలాస మండలం :
  • జనాభా 37,951
  • పురుషులు: 18,600
  • స్త్రీలు: 19,051
  • భౌగోళిక విస్తీర్ణం: 1469 హెక్టార్లు
నీటిపారుదల
  • వంశధార పరిధిలో... 2353 హెక్టార్లు
  • ఆయకట్టు: 2753 హెక్టార్లు
  • చిన్ననీటి తరహా వనరులు 90
  • ఆయట్టు: 2263 హెక్టార్లు
  • జీడి విస్తీర్ణం: 1564 హెక్టార్లు
  • కొబ్బరి: 112 హెక్టార్లు

వజ్రపు కొత్తూరు మండలం :
  • జనాభా - 69,401
  • పురుషులు - 33,408
  • స్త్రీలు - 35,993
  • మెత్తం విస్తీర్ణం - 13,810 హెక్టార్లు
  • చదువుకున్నవారు - 37,458
  • వంశధార కెనాల్‌ - 5,014 ఎకరాలు
  • చెరువులు - 287
  • ఆయకట్టు - 2073 ఎకరాలు
  • జీడి విస్తీర్ణం - 3759 హెక్టార్లు
  • కొబ్బరి - 1866 హెక్టార్లు
  • పంచాయతీలు - 37
  • రెవెన్యూ గ్రామాలు - 59
  • అనుసంధాన గ్రామాలు - 70
  • తీరప్రాంతం - 1010 హెక్టార్లు

మందస మండలం :
  • జనాభా - 82,000
  • పురుషులు - 39,200
  • స్త్రీలు - 40,800
  • అక్షరాస్యులు - 29వేలు
  • విస్తీర్ణం - 47 వేలు
  • రైతులు - 13వేలు
  • వరి - 13వేల హెక్టార్లు
  • జీడి - 2,500 హెక్టార్లు
  • కొబ్బరి - 1500హెక్టార్లు

Courtesy with Eenadu Telugu newspaper
  • ========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment